🕉️ శివ మహిమ – దేవరహస్యం 🕉️
🙏 పవిత్ర ప్రార్థన 🙏
నమంతి మునయస్సర్వే , నమంతి అప్సరసాంగణాః
నరాః నమంతి దేవేశ నకారాయ నమో నమః
మహాదేవం, మహాత్మానం, మహాధ్యానపరాయణం
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః
శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం
శివమేకపరం నిత్యం ‘శి’కారాయ నమో నమః
వాహనం వృషభస్య దేవో వాసుకి కంఠ భూషణం
వామ్ శక్తర్థం దేవం ‘వ’కారాయ నమో నమః
యం కారో పరిసంస్థుతే దేవో యంకారం పరమం శుభం!
యం నిత్యం పరమానందం ‘య’కారాయ నమో నమః
🌺 దేవలోకంలో...
ప్రార్థనానంతరం భక్తిపూర్వకంగా నమస్కరించి తప్పుకున్నారు ప్రమధులు.
‘‘ఆదిదంపతులకు ప్రణామాలు!’’ అంటూ నమస్కరించిన నారదుని వైపు ప్రసన్నంగా చూస్తూ... ‘‘నారదా! త్రిలోక సంచారివి గదా! నీవు చూసివచ్చిన వింతలేవైనా వుంటే వినిపించు.’’ అన్నారు పార్వతీ పరమేశ్వరులు.
‘‘వింతలలో వింతే మరి!’’ భూలోకంలో అన్యోన్యంగా జీవిస్తున్న సుందర దత్తుడు, లీల అకస్మాత్తుగా పరస్పరం శాపాలు ఇచ్చుకుని విడిపోవటం చూసి వస్తున్నానని నారదుడు వివరించాడు.
సుందరదత్తుడిలో మోక్షకాంక్ష కలిగించడానికి స్వప్నంలో ప్రబోధించానని, అతనికి భువిలో ఒక దివ్యకార్యం ఉందని చెప్పారు. లీలలో మాత్రం ఐహిక వాంఛలు, తమోగుణం అధికమవడం వల్ల శాపం సంభవించిందని తెలిపారు. అయితే ఈ శాపమే భవిష్యత్తులో జగన్మాత అవతారానికి నాంది అవుతుందని దేవరహస్యం వెల్లడించారు.
నారదుడు ఆనందంతో నమస్కరించి సెలవు తీసుకోగా...
‘‘జాగ్రత్త నారదా! దేవరహస్యాన్ని దేవరహస్యంగానే ఉంచాలి.’’ అని పరమేశ్వరుడు హెచ్చరించాడు.
👑 పాతాళలోకంలో...
దానవరాజు దనువు కుమారులు రంభ, కరంభులు దీర్ఘ సమాలోచనలో మునిగి ఉన్నారు.
రంభుడు కూడా అంగీకరించగా... అదే సమయంలో శుక్రాచార్యులే అక్కడికి విచ్చేశారు.
ఈ బాలిక కారణజన్మురాలు. దానవుల ఖ్యాతిని జగత్తంతటా వ్యాపింపజేస్తుంది. మొదట మహిషి రూపంలో కనిపించినందున... ఈమె "మహిషి" అనే పేరుతో ప్రసిద్ధురాలవుతుంది.