_*🚩అయ్యప్ప చరితం - 19 వ అధ్యాయం🚩*_

🕉️ శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 🕉️
🪔 ☘️ 🪔 ☘️ 🪔 ☘️ 🪔
బ్రహ్మజ్ఞాన మహిమ

సృష్టి, స్థితి, లయ అనే మూడు కార్యాలను మూడు రూపాలలో నిర్వహించేది నిర్గుణ పరబ్రహ్మమే. ఈ భూలోకంలో జీవాత్మగా ప్రతి హృదయంలో పరమాత్మ వెలుగొందుతాడు. జీవుడు జననం నుండి వృద్ధాప్యం వరకు కర్మలను అనుభవించి, వాటి ఫలితానుసారం మరొక శరీరాన్ని పొందుతాడు.

గురుపుత్రా! అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు జీవాత్మను కప్పివేస్తాయి. అందువల్ల పరమాత్మను దర్శించే అదృష్టాన్ని కోల్పోతాడు. బ్రహ్మజ్ఞానం పొందలేక అజ్ఞానంలోనే జీవితం గడుస్తుంది.

"ఓంకారాన్ని జపిస్తూ యోగమార్గంలో సాధన చేయి. క్రమంగా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు జీవాత్మ పరమాత్మను చేరి ముక్తిని పొందుతుంది."
మణికంఠుని తిరుగు ప్రయాణం

"ధన్యులం ఓంకారరూపా! మణికంఠా! మీకు మా కోటి కోటి ప్రణామాలు." అంటూ గురువుగారు, ఆయన కుమారుడు నమస్కరించారు. గురువు అనుమతితో మణికంఠుడు రాజధానికి తిరిగి వచ్చాడు.

అప్పటికే పదేళ్ల వయస్సులో ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ప్రజాహిత పాలనతో అందరి అభిమానాన్ని పొందాడు. తన కుమారుడి పాలనా సామర్థ్యాన్ని చూసి రాజశేఖరుడు పట్టాభిషేకం చేయాలనే సంకల్పం చేసుకున్నాడు.

🙏 🌺 🙏 🌺 🙏 🌺 🙏
🌸 స్వామియే శరణం అయ్యప్ప 🌸

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow