శ్రీ దుర్గా దేవి గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

 


 

శ్రీ దుర్గా దేవి

రంగు:  నిండు ఎరుపు

పుష్పం:  మందార

ప్రసాదం:  పులగం, కదంబం


దసరా నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మను శ్రీ దుర్గా దేవిగా అలంకరిస్తారు.


దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.


పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము.  భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.


పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.

మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును  పఠించాలి. దుర్గా సూక్తము పారాయణ చేయవలెను. దుర్గా, లలితా అష్టోత్తరములు పఠించవలెను.

నివేదన: పులగము నివేదన చెయ్యాలి.


ఒకసారి వశిష్ట మహర్తి విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, 'నా, స్పురణ మాతంగా ఏ చైతన్యశక్తి ఉత్పున్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావి(తి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవతుదిన్నాయి' అని బ్రహ్మ తెలియజేశాడు.


గాయత్రీ మంత్రం:

ఓం భూర్బువస్సువః

తత్సవితుః వరేణియం

భర్గో దేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్‌ ||


ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రీని మించిన మంత్రం లేదు. ఈ తల్లిని మించిన దైవం లేదు.


గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

01. వినాయకుడు: 

సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్దినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.


02. నృసింహ స్వామి: 

పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయన.


03. విష్ణుమూర్తి: 

పాలనాశక్తికి అధిష్టాత అయిన విష్టు సర్వజీవ రక్షకుడు.


04. ఈశ్వరుడు: 

సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.


05. శ్రీకృష్ణుడు: 

యోగ శక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సాందర్యాదులును ప్రసాదిస్తాడు.


06. రాధాదేవి: 

ఈమె ప్రేమ శక్తికి అధిష్టాత్రి, భక్తులకు నిజమైన _ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.


07. లక్ష్మిదేవి: 

ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.


08. అగ్నిదేవుడు: 

తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి తేజస్సు శక్తి సామార్ద్యాలను ప్రసాదిన్తాడు.


09. మహేంద్రుడు: 

రక్షాశక్తికి అధిమాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులునుండి రక్షిస్తాడు.


10. సరస్వతి: 

విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్దిని ప్రసాదిస్తుంది.


11 దుర్గాదేవి: 

దమన శక్తికి అధిషాతైి. అన్ని బాధలనూ తొలగించి, శతువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.


12. ఆంజనేయుడు: 

నిష్టాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి నిష్ట, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.


13. భూదేవి: 

ధారణాశక్తికి అధినేతి. సకల ప్రాణకోటికి క్షమాశఖీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.


14. సూర్యు భగవానుడు: 

ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ష జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.


15. శ్రీరాముడు: 

ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధినేత ఈయన.


16. సీతాదేవి: 

తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్టులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమే.


17 చంద్రుడు: 

శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.


18. యముడు: 

కాలశక్త్వాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.


19. బ్రహ్మ: 

సకల సృష్టికి అధిమాత.


20. వరుణుడు: 

భావకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.


21. నారాయణుడు: 

ఆదర్శ శక్తికి అధిష్టాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.


22. హయగీవుడు: 

సాహన శక్తికి అధిష్టాత, ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిన్తాడు.


23. హంస: 

వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షిరనీరవివేక జగత్‌ ప్రసిదమైంది.


24. తులసీ మాత: 

సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.


త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్టించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్పు బలం, ఏకాగ్రత, ఇం(దియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. 


హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పుటిక్తీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శేష్టమైనది. నాలుగు వేదాలలో గాయత్రీలో సమానమైన మంత్రం

ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్టలతో గాయత్రిని ధ్యానించలేని,

ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పుటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత జపం చేయువచ్చు. గాయత్రీ మంతాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ 'ఓం నమో గాయత్రీ మాతే' అని ఎన్నిసార్లు వీలైతే

అన్నిసార్లు జపిస్తే తప్పక సత్పలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహము తప్పుక లభిస్తుంది.


బ్రహ్మ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వరమంత్రత్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్బుత చంధో తరంగం గాయత్రీ మంతం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ

తపోబల సంపన్నుడు విశ్వామ్మిత మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంతమే ఇది.


గాయత్రీ మంత్రాక్షరాలు :

సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం

సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే

“న గాయత్‌ర్యా నరం మంత్రం న మాతుః పర దెవతమ్‌ ||


గాయత్రి మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్టమైనది. 'గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ. శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే  బ్రహ్మమని

శతపథ బ్రహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24

ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు.

   ఈ 24 అక్షరాలే 24 దైవిక శకులకు ప్రతికలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.


గాయత్రీ మంత్ర  విశిష్టతను తెలియజేసే కథ :

పూర్వం ఒకప్పుడు అరుణుడు అన బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను

ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్వువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు.  అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్దరంగంలో కాని, శస్తాస్తాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. బ్రహ్మ "తథాస్తు" అన్నాడు.


బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షనగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిదుడయ్యాడు. ముందుగా ఒక దూతను ఇంద్రుని వద్దకు పంపి యుద్దానికి సిద్దపడుమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లి మొఱపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని

వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్టువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొఱ విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్పు, అతన్ని వధించడం సాద్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్ధించవలసిందిగా సూచించాడు.


బ్రహ్మేంద్రాది దెవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత

అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన

ఆలోచన దేవగురువైన బృహస్పుతికి స్పురించింది.

ఈ స్పురణ దేవీ సంకల్పంగా గుర్తించి, బృహస్పుతి

అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పుతిని

చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి,"

మునీంద్రా నేను రాక్షసుడను కదా! మీరు

దేవగురువులు. దేవతలు నాకు శత్రువులు నాతో

మీకేమి పని? మీరాకకు కారణం ఏమిటి! అని

Previous Post Next Post

نموذج الاتصال